హైదరాబాద్, ఆగస్టు27 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ ఎస్సీ యువతకు ఐటీ, పలు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని సావిత్రీబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ ఆదినారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు సెప్టెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పదోతరగతి ఆపై చదివిన యువతకు ఈ శిక్షణకు అర్హులు అని తెలిపారు. మూడు నెలల శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. వివరాలకు 83410 52153, 96525 77844ను సంప్రదించాలని లేదా సైదాబాద్, జయనగర్ కాలనీలోని సంస్థ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని సూచించారు.