హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీసీపీఎల్) ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 14 మెగా హెల్త్క్యాంపులు నిర్వహించి, 2,713 మంది లారీ డ్రైవర్లకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఓ సర్వే ప్రకారం భారతీయ ట్రక్ డ్రైవర్లలో దాదాపు 50 శాతం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హెల్త్క్యాంపులు నిర్వహించేందుకు బీపీసీఎల్ ‘అవేర్’ అనే ఎన్జీవో సహకారం తీసుకున్నది. విశాఖపట్నం, గుంటూరు, చిత్తూ రు, హైదరాబాద్, హుబ్లీ, బళ్లారి, చికబళ్లాపూర్, పీణ్య, మంగళూరు, చెన్నై, ట్యూటికోరిన్, పుదుచ్చేరి, ఎర్నాకుళం, పుదుచ్చేరిలో క్యాంపులు ఏర్పాటు చేసింది. ఈ నెల 5న ప్రారంభమైన ఈ క్యాంపులు 14న ముగిశాయి. ఇందులో 2,713 ట్రక్ డ్రైవర్లకు ఈసీజీ, బ్లడ్ షుగర్, కంటి పరీక్షలు, ఈఎన్టీ పరీక్షలు, క్యాన్సర్ స్రీనింగ్, హెచ్ఐవీ వం టి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు, భోజనం అందజేశారు. దీంతోపాటు కొవిడ్ బూస్టర్ డోస్ల కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.