సిద్దిపేట, అక్టోబర్ 19: ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా షుగర్, బీపీ బాధితులతోపాటు క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రా జెక్టు కింద ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తం గా విస్తరించనున్నా రు. నాన్ కమ్యునబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో నెలకు సరిపడా మందు లు ఉంటాయి. ఏఎన్ఎంలు స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి కిట్ అందజేస్తారు. మందులు ఎలా వాడాలో సూచనలు చేస్తారు.