హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రజకులు, నాయీ బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం, సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకూ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మైనార్టీ సంక్షేమ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.