భీంపూర్, ఫిబ్రవరి 24: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్కు ఇవి తారసపడ్డాయి.
గుంజాల-గొల్లఘాట్ మార్గంలో వస్తుండగా ఓ పెద్దపులి, మూడు పిల్లలు రోడ్డు దాటుతూ కనిపించాయి. వాటిని చూసి వాహనం ఆపిన డ్రైవర్, వీడియో తీసి అధికారులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం ఎఫ్ఆర్వో గులాబ్సింగ్ తదితరులు అక్కడికి చేరుకొని, గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివార్లలో 10 సీసీ నైట్ విజన్ కెమెరాలు అమర్చారు.