హైదరాబాద్ : నగరంలోని నెహ్రూ జూ పార్క్లోకి కొత్తగా నాలుగు వైల్డ్ డాగ్స్ వచ్చి చేరాయి. గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వైల్డ్ డాగ్స్ను ఎన్ క్లోజర్ లోకి విడుదల చేశారు. అనంతరం మంత్రి పక్షుల ఎవియారీ కాంప్లెక్స్, సీసీ కెమెరా సర్విలెన్స్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రారంభించారు.
కార్యక్రమంలో బహదూర్ పూర్ ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్, పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, ఎం.సీ. పర్గెయిన్, వినయ్ కుమార్, ఏ.కే.సిన్హా, సునీత భగవత్, సీసీఎఫ్ ఎం.జె. అక్బర్, రిటైర్డ్ పీసీసీఎఫ్ బీఎస్ఎస్ రెడ్డి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.