భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. చర్ల మండలం పరిధిలోని బత్తినపల్లి-రామచంద్రాపురం గ్రామాల మధ్య పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు తారసపడటంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరింత మంది నక్సల్స్ ఉన్నారన్న సమాచారం మేరకు అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నట్లు సమాచారం.