హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 1997 బ్యాచ్కు చెందిన నలుగురు ఐపీఎస్లకు అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ డీజీలుగా పదోన్నతులు పొందినవారిలో నార్త్జోన్ ఐజీ వై నాగిరెడ్డి, హైదరాబాద్ కమిషనరేట్లో శాంతిభద్రతల అడిషనల్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్, డీజీపీ కార్యాలయంలో పీఅండ్ఎల్ ఐజీ, ఫైర్ సర్వీసెస్ డీజీ సంజయ్కుమార్ జైన్తోపాటు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ ఉన్నారు. వీరిలో విజయ్కుమార్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. మిగిలిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను అడిషనల్ డీజీ హోదాలో తిరిగి అదే పోస్టులో నియమించినట్టు పేర్కొన్నారు.
ఐదుగురికి ఐజీలుగా పదోన్నతి
2004 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు ఐజీలుగా పదోన్నతి పొందారు. వీరిలో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి, ఇంటెలిజెన్స్ ఐజీ వీ శివకుమార్, వీబీ కమలాసన్రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్రెడ్డి, హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ ఉన్నారు. వీరిలో కమలాసన్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మిగిలిన వారిని యథాతథస్థానాల్లోనే కొనసాగించారు. 2008 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి తస్వీర్ ఇక్బాల్కు డీఐజీగా పదోన్నతి లభించింది. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
మరో ఇద్దరికి..
2009 బ్యాచ్కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులకు సెలెక్షన్ గ్రేడ్, ఐపీఎస్ పే మ్యాట్రిక్స్లో లెవల్ 13ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర సర్వీస్ల్లో డిప్యుటేషన్పై ఉన్న అంబర్కిశోర్ ఝా, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరికి ఈ పే మ్యాట్రిక్స్లో పదోన్నతి లభించింది. వీరిద్దరినీ యథాతథ స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్టు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.