కేసముద్రం, అక్టోబర్ 27 : మహబూబాబాద్లో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సమక్షంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలకేంద్రానికి చెందిన సావిత్రమ్మ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగుదేశంలోనే ఉన్న ఆమె సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఇనుగుర్తి ప్రజల దశాబ్దాల కోరిక సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని, ప్రజల ఆకాంక్ష మేరకు ఇనుగుర్తిని మండలకేంద్రంగా ప్రకటించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.