హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): గ్రామాల అభివృద్ధి కోసం తాము చేసిన ఖర్చులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యాదేవరాజన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్య, కార్యదర్శి మల్లయ్యయాదవ్, అంజయ్యగౌడ్, అరవింద్రెడ్డి, బొట్ల రవి, శ్రీకర్రెడ్డి, కరుణాకర్, రామునాయక్, సాగర్, లక్ష్మీనాయక్ పాల్గొన్నారు.