హుజూరాబాద్, ఏప్రిల్ 5: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు తిప్పారపు సంపత్ డిమాండ్ చేశారు. అతనిపై విచారణ చేపట్టి జైలుకు పంపాలని కోరారు. ఈ మేరకు సంపత్ మాట్లాడిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ‘ఐదురోజులుగా మాజీ మంత్రి ఈటలపై అవినీతి ఆరోపణలు వస్తుంటే.. అతనొక్కడే నీతివంతుడైనట్టు, ఆత్మగౌరవంతో బతుకుతున్నట్టు స్పీచులు ఇవ్వడం సిగ్గుచేటు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నీ అరాచక పాలనతో ఎంతోమంది దళితుల జీవితాలతో ఆడుకున్నావు’ అని మండిపడ్డారు. ‘కమలాపూర్ మండలంలోని సర్పంచ్, ఎంపీటీసీల మీద కేసులు పెట్టింది నిజం కాదా? వాళ్లను కొట్టించింది నిజంకాదా? హుజూరాబాద్కు చెందిన ప్రవీణ్యాదవ్ చావుకు కారణం నీవు కాదా? మేకల సుధాకర్ మీద కేసులు పెట్టి, పీడీ యాక్టు పెట్టింది నిజం కాదా..? అని నిలదీశారు.