హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్విట్టర్ వేదికగా ఓ సూచన చేశారు. తెలంగాణకు జాతీయ స్థాయి ప్రాజెక్టులు తీసుకురావాలని సూచించారు.
ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, డిఫెన్స్ కారిడార్, పసుపు బోర్డులాంటి వాటిని రాష్ట్రానికి కేటాయించేలా మోదీ, అమిత్షాను అభ్యర్థించాలని గవర్నర్కు నాగేశ్వర్ సూచన చేశారు. రాజకీయ లేదా వ్యక్తిగత కుమ్ములాటలు తెలంగాణ ప్రజలకు ఏం అందించలేవు అని నాగేశ్వర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Appeal to Governor to urge Modi-Shah to give a national project, IIM, IIIT, steel plant, Tribal varsity,rail coach factory, ITIR, Defense Corridor, turmeric board etc to Telangana. Political or personal squabbles do not deliver anything to the people of Telangana.@DrTamilisaiGuv
— Prof. K.Nageshwar (@K_Nageshwar) April 9, 2022