Apps:
Follow us on:

Telangana | మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించిన సీఎం కేసీఆర్

1/3Telangana |  హైద‌రాబాద్ : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ‌పేట్ జిల్లాలోని మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మొహమ్మద్ సలీంలను నియమించారు.
2/3తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్‌ప‌ల్లి మండలం మార్వెల్లికి చెందిన మాటం భిక్షపతిని నియమించారు.
3/3తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్‌ను నియమించారు. వీరంతా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.