హైదరాబాద్ : తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే( BRS) కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్( Aruri Ramesh) అన్నారు. బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నిజం కాదన్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిషాను కలువలేదని స్పష్టం చేశారు. నన్ను ఎవరూ బలవంతంగా తీసుకెళ్ల లేదు. నా వ్యక్తిగత పనిమీద హైదరాబాద్ వెళ్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.
కాగా, రమేష్ బీజేపీలో చేరాలని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నానా హంగామా సృష్టించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న అరూరి రమేష్ను వాహనంలో నుంచి బీజేపీ కార్యకర్తలు బయటకు లాగారు. బీజేపీలో చేరాలని రమేష్ను ఆ పార్టీ కార్యకర్తలు దీనంగా వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తాను మారడం లేదని ఆయన స్పష్టతనిచ్చారు.