అవినీతి అక్రమాలు రుజువై జైలుకెళ్లడం ఖాయం
హుజూరాబాద్ టీఆర్ఎస్ నాయకులు
హుజూరాబాద్టౌన్, మే 25: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఈసారి జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, తగిన గుణపాఠం చెబుతామని హుజూరాబాద్ టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ పట్టణాధ్యక్షుడు పంజాల కుమారస్వామి, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. భూముల ఆక్రమణ కేసులో ఈటల రాజేందర్ జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఈటల ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఈసారి ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్కు డిపాజిట్ గల్లంతు అవుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నియోజకవర్గానికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విద్యార్థి సంఘాల నాయకులు, లాయర్లు, బీసీ కుల సంఘాల నాయకులు వచ్చి తనకు మద్దతుగా ప్రచారం చేసి గెలిపిస్తారని గొప్పలు చెప్పుకొంటున్న ఈటల రాజేందర్కు ఇక్కడి ప్రజల మద్దతు ఉంటే ఇక్కడి వారితోనే నియోజకవర్గంలో ప్రచారం చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికల్లో పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మొలుగూరి ప్రభాకర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఈటల రాజేందర్ ప్రజల మధ్యకు వస్తే ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులను కార్యకర్తలు, నాయకులు బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పదహారేళ్లపాటు నియోజకవర్గంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు పార్టీ కోసం పైసా ఖర్చు చేయకుండా తను మాత్రం వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన కూడబెట్టుకున్నాడని ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ ఆలయ మాజీ చైర్మన్ భూసారపు వెంకటేశ్వర్లు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సబ్బని రమేశ్, టీఆర్ఎస్ యూత్ పట్టణాధ్యక్షుడు గందె సాయిచరణ్, టీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గాలి రాకేశ్, మైనార్టీ నాయకుడు షేక్ ఫయాజ్, నాయకులు మక్కపెల్లి రమేశ్యాదవ్, చొల్లేటి శ్యాం, కర్రి సత్యం, విక్కీ, మధుకర్రెడ్డి, బోళ్ల రమేశ్, కెక్కెర్ల సారయ్య, అశోక్, డిష్ రవీందర్రావు, మొలుగు శ్రీనివాస్, అనిల్, పంజాల మురళీగౌడ్, బాబా మహ్మద్, కాపర్తి సంతోష్, యాదగిరి, అన్నయ్య లింగం, భాస్కర్చారి తదితరులు పాల్గొన్నారు.