హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ స్కామ్లో తన వాటా కింద వచ్చిన సొమ్ములో కెనరా బ్యాంక్ చందానగర్శాఖ మాజీ మేనేజర్ సాధన రూ.1.75 కోట్లు వెచ్చించి విల్లాను కొనుగోలు చేసినట్టు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైం ది. సీసీఎస్ ఏసీపీ మనోజ్కుమార్ బృందం ఆమెను విచారిస్తున్నది. కుంభకోణం సూత్రధారి సాయికుమార్ నుంచి రూ.1.99 కోట్లు తనకు ముట్టాయని తెలిపింది. ఆ సొమ్ములో రూ.60 లక్షలు సాయికుమార్ ముఠాకు చెందిన వెంకటరమణకు మధ్యవర్తిగా వ్యవహరించిన గుంటూరుకు చెందిన సాంబశివరావుకు కమీషన్ ఇచ్చినట్టు పేర్కొన్నది. మిగతావాటిలో రూ.40 లక్షలతో వైజాగ్లో ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ తీసుకోవడంతోపాటు తన భర్త బాబ్జీకి రూ.10 లక్షల నగదు ఇచ్చినట్టు ఆమె వెల్లడించింది. బ్యాంక్లోను తీసుకొని స్కామ్లో వచ్చిన సొమ్ములో నుంచి రూ.75 లక్షలు వెచ్చించి శంకర్పల్లిలో విల్లా కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. పలువురు నిందితులను పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు.