హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): అక్రమాస్తుల కేసు లో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్టు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై బినామీ ఆస్తులుగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. వీరితోపాటుగా బాలకృష్ణతో సంబంధం ఉన్న పలువురు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.