హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పారు సేవలను ఇకపై ఆన్లైన్లో కూడా పొందవచ్చని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన జూ పారు కొత్త వెబ్సైట్, మొబైల్ యాప్ను అరణ్యభవన్లో సోమవారం మంత్రి ఆవిష్కరించారు. వెబ్సైట్లో జూ సమస్త సమాచారంతోపాటు సందర్శకులు సులువుగా ఎంట్రీ టికెట్, బ్యాటరీ వెహికల్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్సైట్ (<https:// nzptsfd.telangana.gov.in/home.do>)ను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, పీసీసీఎఫ్, హెచ్వోఎఫ్ఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎంసీ పర్గయిన్, జూ పారు డైరెక్టర్ వినయ్కుమార్, క్యురేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.