హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): పేద బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ చదువులకు అండగా నిలుస్తున్న వివేకానంద విదేశీ విద్యా పథకానికి 2022-23 సంవత్సరానికి అర్హులైనవారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలు, మార్గదర్శకాల కోసం అధికారిక వెబ్సైట్ www.brahminparishad.telangana.gov.inను సందర్శించాలని సూచించారు. ఆన్లైన్లో సరియైన ధ్రువపత్రాలను జత చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు బోధన రుసుము (ట్యూషన్ ఫీజు) పొందవచ్చని తెలిపారు.
వివేకానంద విదేశీ విద్యా పథకానికి అర్హతలు
బ్రాహ్మణ పరిషత్తు సాయంతోనే
నేను జర్మనీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశా. ప్రస్తుతం బెర్లిన్లో రూ.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. నా కుటుంబానికి విదేశాల్లో విద్య చదివించేంత ఆదాయం లేదు. వివేకానంద విదేశీ విద్యా పథకం ద్వారా నాకు రూ.19.91 లక్షల సాయం అందించారు. దీంతో నాకు ఉన్నత విద్య అవకాశం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వానికి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు ధన్యవాదాలు.
– వేల్పూరు శ్రీకశ్యప్, జర్మనీ
సాయం లేకుంటే కలగానే విదేశీ విద్య
నేను అమెరికాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో పీజీ చేశా. ప్రస్తుతం యూఎస్లో మైక్రోచిప్ టెక్నాలజీ కంపెనీలో డిజైన్ ఇంజినీర్గా రూ.70 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. మాది మధ్య తరగతి కుటుంబం. విదేశాల్లో విద్య అనేది మాకు కలగానే ఉండేది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్కాలర్షిప్ అందించడంతో అమెరికాలో చదవగలిగా. మంచి ఉద్యోగం సంపాదించగలిగా. మా కుటుంబానికి అండగా ఉండగలుగుతున్నా.
– ఏలేశ్వరపు శ్రేయ తేజస్వి, యూఎస్