ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం, విదేశీ విద్యకు ఆర్థిక సహకారం అందిచే పథకాన్ని హైదరాబాద్ సంస్థానం ప్రవేశపెట్టింది. ఈ ఉపకార వేతనాన్ని ప్రతిభ ప్రామాణికం కాకుండా మతం ప్రామాణికంగా ఎంపిక చేయడం పట్ల ఆనాటి విద్యార్థులు వ్యతిరేకించారు. ఇంగ్లండులో చదివేందుకు విద్యార్థుల్ని ఎంపిక చేసే కమిటీలో కొందరు హిందూ ఛాందస భావాలున్నవారిని ప్రభుత్వం నియమించింది. వారు హిందువులు సముద్రయానం చేయకూడదు కాబట్టి హిందూ విద్యార్థులను ఎంపిక చేయలేదు.
వారిని అడ్డుకునేందుకు విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసే విద్యార్థులకు తప్పనిసరిగా ఉర్దూ, పారశీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలని షరతు పెట్టింది. ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకు ఉర్దూ, పారశీ భాషల్లో ప్రావీణ్యం గురించి అడగడం హిందూ విద్యార్థుల్ని అడ్డుకోవడానికేనని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిని నిరసిస్తూ 1892లో హిందూ విద్యార్థులు హిందూ సోషల్ క్లబ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలో సంఘటితమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్లబ్కు రాజా మురళీ మనోహర్, శ్రీకృష్ణ అయ్యంగార్, రామచంద్ర పిైళ్లె ముఖ్య నాయకులు.