హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం సృష్టించింది. భావనపాడు సమీపంలో మత్స్యకారుల వలలో అది చిక్కడం సంచలనంగా మారింది. విమానాన్ని పోలిన 10 అడుగుల డ్రోన్ లభ్యం కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన మత్స్యకారులు గురువారం దానిని మెరైన్ పోలీసులకు అప్పగించారు.
డ్రోన్లపై టార్గెట్ బన్షీ అని స్టిక్కర్లు అతికించి ఉన్నాయి. అది 111 కిలోల బరువున్నదని పోలీసులు తెలిపారు. ఆకతాయిల పనా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.