జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. 75 ఏండ్లలో సీఎంను చేయడానికి కాంగ్రెస్కు బీసీ అభ్యర్థి కరువయ్యాడా అంటూ బీసీ సంఘాల ఐక్య వేదిక పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీసీలను కరివేపాకులా వాడుకుంటారా అని అందులో నిలదీశారు. ఇరువు అగ్రనేతలు శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వక్తులు పట్టణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.