మెట్పల్లి, జూలై 15 : బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో ఐదుగురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా విధిస్తూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో 2020 అక్టోబర్లో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో లోకిని రాజేశ్ (22), దారంగుల సాయికుమార్ (21), మొగిలిపాక అనిల్ (19),కుంచెపు శివ (19), కుంచెపు వెంకటేశ్(22)పై మెట్పల్లి పోలీస్స్టేషన్లో పోక్సో చట్టం కింద అప్పటి ఎస్ఐ సదాకర్ కేసు నమోదుచేశారు.
కేసులోని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.12 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.