హైదరాబాద్ : కొవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఐదు ఆస్పత్రుల కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం శనివారం తాజాగా మరో ఐదు ఆస్పత్రుల కొవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. ఇమేజ్ ఆస్పత్రి(అమీర్పేట), అంకురా ఆస్పత్రి(ఎల్బీ నగర్), సాయి లైఫ్ ఆస్పత్రి(భూత్పూర్, మహబూబ్నగర్), సాయి సిద్దార్థ ఆస్పత్రి(షాపూర్ నగర్, సంగారెడ్డి) అనుమతులను రద్దు చేసింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని మొత్తం 115 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నిన్న 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రజారోగ్య విభాగం ఈవాళ మరో 15 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది.