Rain Alert | వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఒత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వొంగి ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ దీని ప్రభావం రాగల 24గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని చెప్పింది. శుక్రవారం ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 నుంచి కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది.