నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 11 : నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన స్టోర్ రూమ్లో కెమికల్ రియాక్షన్తో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దవాఖానలోని మాతా శిశు కేంద్రంలోని స్టోర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో పసిపిల్లలతో తల్లులు భయంతో బయటకు పరుగులు తీశారు. పై ఫ్లోర్ వరకు పొగలు కమ్ముకోవడంతో హాస్పిటల్, ఫైర్ కిటికీల అద్దాలు పగులగొట్టి పొగ బయటకు వెళ్లేలా చేసి ఫైర్ ఎక్స్టెన్షన్తో ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరుగలేదని దవాఖాన సూపరింటెండెంట్ లచ్చునాయక్ తెలిపారు.
ఆ సమయంలో మాతా శిశుకేంద్రంలో 100 మందికి పైగా పసిపిల్లల తల్లులు ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారిని పరిశీలించి పొగలు తగ్గిన అనంతరం తిరిగి వారి రూమ్లకు తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దవాఖానకు వెళ్లి వివరాలను సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూంలో బాత్ రూం క్లీన్ చేసే సల్ఫ్యూరిక్ యాసిడ్ 5ఎంఎల్ మగ్గులో ఉండగా.. ఆ ద్రావణం బ్లీచింగ్ పౌడర్లో కలువడంతో పొగ వచ్చిందని సూపరింటెండెంట్ తెలిపారు.