పెద్దపల్లి, సెప్టెంబర్10: కర్ణాటకలోని మైసూర్ నుంచి దర్భాంగ వెళ్తున్న బాగ్మతి ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో పొగలు రావడం కలకలంరేపింది. పెద్దపల్లి రైల్వే స్టేషన్ దాటి వెళ్తున్న క్రమంలో పొగలు రావడం గమనించిన రైల్వే అధికారులు రైలును తిరిగి పెద్దపల్లి స్టేషన్కు తరలించారు.
అప్పటికే సమాచారం అందుకొన్న ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్కు చేరుకొని, అధికారులతో కలిసి ఇంజిన్, బోగీలను పరిశీలించారు. కాసేపటికే పొగలు ఆగిపోయాయి. సాంకేతిక లోపంతోనే పొగలు వచ్చాయని నిర్ధారించుకొన్న అధికారులు మరో ఇంజిన్ను అమర్చి గమ్యస్థానానికి పంపించారు.