హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : విశాఖ-తిరుమల ఎక్స్ప్రెస్లో టపాసుల శబ్దం కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగిలో టపాసులు పేలి పొగలు, శబ్దం వచ్చాయి. పేలుళ్లతో ప్రయాణికులు ఆందోళన చెందారు. టపాసుల బ్యాగును ప్రయాణికులు కాళ్లతో బయటకు వేశారు.
రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమై, రైలులో తనిఖీలు చేశారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో తుని నుంచి రైలు గమ్యస్థానానికి బయలుదేరింది.