హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ నోటిఫికేషన్లో 182 పీటీటీ పోస్టులతోపాటు, 1500 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను కూడా భర్తీ చేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ అన్ఎంప్లాయ్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (టీయూపీఈటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మారగోని సైదులు డిమాండ్ చేశారు. ఈ విషయమై యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కు చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం ప్రారంభమైందని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల నుంచి యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.