హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుల స్మార్ట్ పోలీసింగ్కు ఫిక్కీ సంస్థ అందించిన అవార్డు ఓ ఉదాహరణ అని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పిల్లల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా డీజీపీ కొనియాడారు. ఆదివారం తన కార్యాలయంలో చైల్డ్ సేఫ్టీ క్యాటగిరీలో అవార్డు అందుకున్న సీఐడీ ఏడీజీ మహేశ్ భాగవత్ను డీజీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఎంతోమంది పిల్లల జీవితాల్లో తెలంగాణ పోలీసులు వెలుగులు నింపారని చెప్పారు. మానవ అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్నది తెలంగాణ పోలీసులేనని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకొని మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాక్షించారు. ప్ర భుత్వ సహకారం, డీజీపీ అంజనీ
కుమార్ ప్రోత్సాహం మరువలేనిదని మహేశ్ భాగవత్ చెప్పారు.