న్యాల్కల్, ఫిబ్రవరి 23 : చెరుకు తోటల సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, యాజమాన్య పద్ధతులు బాగున్నాయని, వీటితో అధిక దిగుబడి సాధించడం అద్భుతమని ఫిజీ దేశ చక్కెర పరిశ్రమ శాఖ మంత్రి చరణ్జీత్ సింగ్ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్పూర్ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. స్థానిక పరిశోధన కేంద్రంలో చెరుకు కొత్త వంగడాలు, సాంకేతిక వ్యవసాయ, యాజమాన్య, యాంత్రీకరణ విధానాలను ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ రెండున్నర ఎకరాల్లో 160 టన్నుల వరకు దిగుబడి వస్తున్నదని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ తెలుపడంతో మంత్రి ఆశ్చర్యపోయా రు. తమ దగ్గర రెండున్నర ఎకరాల్లో 45 ట న్నుల దిగుబడి మాత్రమే వస్తున్నదని తెలిపారు. ఇక్కడ చెరుకు తోటల సాగులో అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులను తమ దేశ రైతులకు అవగాహన కల్పించి అధిక దిగుబడులను సాధించేలా కృషి చేస్తామన్నారు.