హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): స్త్రీనిధి ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని స్త్రీనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద సంఘం నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్త్రీనిధి సిబ్బందికి 30 శాతం పీఆర్సీని వర్తింపజేయాలని కోరారు.
స్త్రీ నిధి సిబ్బందిని మూడేండ్లకోసారి బదిలీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఎల్ రూప్సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎం అరుణ్ సింగ్, అధ్యక్షురాలిగా కే రజిత, కార్యదర్శిగా బీ కిశోర్, కోశాధికారిగా జీ రాధాకృష్ణ, ఉపాధ్యక్షులుగా జీ వసంత, ఎండీ రియాజ్, ఎన్ రాములు ఎన్నికయ్యారు.