న్యూఢిల్లీ, మే 17: వచ్చే మూడు, నాలుగు వారా ల్లో డ్రోన్ పైలట్ శిక్షణ ఫీజులు తగ్గుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. డ్రోన్ పైలట్ శిక్షణకు ఫీజులు అధికంగా ఉన్నాయని మంగళవారం వర్చువల్గా జరిగిన సమావేశంలో ఓ రైతు ప్రశ్నించారు.
దీనిపై సింధియా స్పంది స్తూ.. గత ఐదు నెలల్లో డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చే 23 స్కూళ్లకు డీజీసీఏ అనుమతుల్చిందని, స్కూళ్ల సంఖ్య పెరుగుతుంటే ఫీజులు తగ్గుతుంటాయన్నారు.