కొడంగల్, మార్చి 28: బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు.. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేయడానికి విఫలయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామ శివారులో జరిగింది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ నియోజకర్గంలోని బొంరాస్పేట మండలం బిక్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ శ్రీనివాస్ నాయక్.. తండ్రి రాథోడ్ ధన్సింగ్ నాయక్ పేరుమీద ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.30 లక్షల వరకు బీమా పాలసీ ఉన్నది. ఎలాగైనా ఈ డబ్బులను తీసుకోవాలన్న దురుద్దేశంతో తండ్రి హత్యకు ప్లాన్ చేశాడు. పథకం ప్రకారం.. కొడంగల్ మండలంలోని ఉడిమేశ్వరం గ్రామ శివారు లో తండ్రి తలపై బండరాయితో బాధి ఘోరంగా హత్యచేశాడు. ఆ తరువాత ఈ ఘటనను బైక్ ఆక్సిడెంట్గా చిత్రీకరించి ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేసేందుకు ప్రయత్నించాడు. మృతుడి రెండో కుమారుడు రాథోడ్ రవినాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై తెలిపారు.