హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు టీఎస్బీపాస్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం.. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా చేప ట్టే సైట్ ఇన్స్పెక్షన్తోపాటు టైటిల్ డీడ్, సాంకేతిక అం శాల తనిఖీ బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించిం ది. ఇప్పటివరకు ఈ మూ డు అంశాలను ముగ్గురు అధికారులు పరిశీలించి, సం బంధిత నివేదికలను అప్లోడ్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియ చాలా ఆలస్యమవుతున్న ట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ మూడు పనులను టౌన్ ప్లానింగ్ అధికారులకు అప్పగించారు. వా రు ఆప్లోడ్ చేసిన వివరాలను మున్సిపల్ కమిషనర్ ఆమోదించి, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపిస్తారు. దీంతో దరఖాస్తుల పరిశీల న వేగ ంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.