నవాబ్పేట, ఫిబ్రవరి 26 : వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావత్ వెంకటేశ్ (47) బుధవారం రాత్రి నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్తు మోటర్ ఆన్చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వెంకటేశ్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 26 : ఆన్లైన్ బెట్టింగ్లో రూ.25 లక్షలు నష్టపోయిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన గీత కార్మికుడు గర్వందుల మహేశ్ (37) ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి రూ.25 లక్షల వరకు పెట్టాడు. అవి తిరిగి రాకపోవడంతోపాటు అప్పులు చేసి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపి నష్టపోయాడు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి బుధవారం రాత్రి గ్రామ శివారులోని రైతువేదిక ఇనుప పైపునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.