కొడిమ్యాల, ఫిబ్రవరి 1 : జగిత్యాల జిల్లా నాచుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా తాండ్రాల బక్కయ్య అనే రైతు లేచాడు. ఆవేశంగా ఊగిపోతూ దళితబంధు, రైతుబంధు పథకాలను వద్దనడానికి ఈటల, బండి సంజయ్ ఎవరు? అంటూ మండిపడ్డాడు. ఇది మంచిపద్ధతి కాదని, ఇట్లా చేస్తే ఓట్లప్పుడు తరిమికొడతామని అనడంతో సభికులు చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు.