పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 15: ప్రముఖ ర చయిత, ప్రజాకవి, వి శ్రాంత ఉపాధ్యాయుడు, వికలాంగుల సంఘం నా యకుడు నల్లెల రాజయ్య (62) కన్నుమూశారు. ములుగు జిల్లా జాకారానికి చెందిన ఆయన హనుమకొండలో ని వాసం ఉంటున్నారు. కొంతకాలం నుంచి అ నారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి తుదిశ్వాస విడిచారు. రాజయ్య అనేక కవితలు, వ్యాసాలు రాస్తూ, హక్కుల గొంతుకగా ప్రజలను చైతన్యం చేశారు. ఆయన మృతి పట్ల సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు, తెలంగాణ రచయితల సంఘం నాయకులు, తెరసం సభ్యులు, కాళోజీ ఫౌండేషన్, మిత్ర మండలి బాధ్యులు సంతాపం ప్రకటించారు.