హైదరాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆహార సంస్థ(ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ సూచించారు.
బుధవారం ఇటలీలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) అధ్యక్షుడు డాక్టర్ కేశవులు, డొంగ్యూతో భేటీ అయ్యా రు. విత్తనరంగం సమస్యలు, పరిష్కారాలపై డొంగ్యూ సూచనలు చేసినట్టు కేశవులు తెలిపారు. ప్రభుత్వరంగంలో విత్తనోత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.