రేగొండ, జనవరి 20: పైసా ఖర్చు లేకుండా రెండు సార్లు కండ్ల పరీక్షలు చేయించుకున్న. అద్దాలు కూడా తీసుకున్న. గిప్పుడు నాకు కండ్లు మంచిగా కనబడుతున్నయ్. గప్పట్ల కంటి పరీక్షలు చేసి అద్దాలిచ్చిన కాడ్నుంచి చూపులో ఇబ్బంది అనిపించలె.
మళ్లీ సీఎం కేసీఆర్ సారు కంటి పరీక్షలు చేసి అద్దాలిత్తరని తెలువంగనే సంబురమైంది. ఇయ్యాల పోతె పరీక్షలు చేసిన్రు. కండ్లద్దాలు ఇచ్చిన్రు. గింత మంచి పనులు చేస్తున్న సీఎం సారు దేవుడు. ఆయన మళ్లీ రావాలె.
– మోటం అబ్బాస్, రేగొండ, జయశంకర్ భూపాలపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన కల్లెంపూడి ద్వారకానాథ్, విజయలక్ష్మి దంపతులు.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని కొమరబం డలో శుక్రవారం కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.