హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు వివిధ మాధ్యమాల ద్వారా 100 కోట్లకుపైగా మెసేజ్లను ప్రజలకు పంపినట్టు పేర్కొన్నది. రాజేందర్ పల్నాటి అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తునకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. సైబర్ దోస్త్ అనే ట్విట్టర్ అకౌంట్, రేడియో, ఆన్లైన్ మాధ్యమాల్లో తక్కువ నిడివి ఉన్న వీడియోల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నట్టు తెలిపింది. సీ-డాక్ సంస్థ ఆధ్వర్యంలో సభలు, అవగాహన సదస్సులు, వర్క్షాప్లు నిర్వహించినట్టు పేర్కొన్నది. సీ-డాక్, ఎన్సీఆర్బీ, బీపీఆర్అండ్డీ వంటి సంస్థలకు సైబర్ నేరాల అవగాహన, పరిశోధన అంశాల కోసం కేంద్ర హోంశాఖ నుంచి గతేడాది రూ.7.28 కోట్లు నిధులు వెచ్చించినట్టు వివరించింది.