హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బడి బయట ఉన్న పిల్లలపై నిర్వహిస్తున్న సర్వేను 31 వరకు పొడిగించారు. ఈ మేరకు డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది. బడిబయట ఉన్న చిన్నారుల వివరాలను సేకరించి వాటిని ప్రబంధ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది.