హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీలో ఎంటెక్ ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించింది. 2021-22 విద్యా సంవత్సరంలో ఎంటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) దరఖాస్తు గడువును ఈ నెల 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏవో రాజేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విద్యార్థులు www. rgukt.ac.in వెబ్సైట్ను చూడాలని సూచించారు.