Traffic Challan | వాహనదారులకు పోలీసుశాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటికే రూ.107కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వాస్తవానికి గడువు నేటితో ముగియగా.. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తుండడంతో గడువును పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.59కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే, రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు.
అయితే, సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నేటితో గడువును పొడిగించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80శాతం రాయితీ.. ఆర్టీసీ బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీ రాయితీని ప్రకటించారు. గతేడాది సైతం రాయితీపై చెల్లించేందుకు సైతం అవకాశం ఇవ్వడంతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300కోట్ల ఆదాయం సమకూరింది.