వరంగల్ : ఆగస్టు ఒకటో తారీకు నుంచి కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్షా మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రతి రోజు రాత్రి 10-50 నిమిషాలకు బయలుదేరి.. బల్లార్షాకు తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. తిరిగి ఈ రైలు బల్లార్షాలో బయలుదేరి ఉదయం 9 గంటలకు కాజీపేట రైల్వే జంక్షన్ కు చేరుకుంటుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.