హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ ్ట(కేటీఆర్)లో పులుల ఆవాసాలను మరింత విస్తరించడంపై రాష్ట్ర అటవీశాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం గుడ్ క్యాటగిరీలో ఉన్న దీన్ని వెరీ గుడ్, ఎక్సలెన్స్ క్యాటగిరీలోకి తీసుకెళ్లడంతోపాటు మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు తిరిగి వెళ్లకుండా తెలంగాణలోనే ఉండేలా చూసేందుకు వరల్డ్ వైల్డ్లైఫ్ ఫెడరేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎల్ఎఫ్)తో చర్చలు జరిపింది. టైగర్ కారిడార్ విస్తరణ, పులుల ఆవాసాల బలోపేతానికి గడ్డి మైదానాలను పెంచడంతోపాటు.. పులుల ఆహారానికి అవసరమైన వన్యప్రాణుల సంతతిని సమకూర్చాలని, అక్రమ వేటను నిరోధించేందుకు స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సూచించింది.