కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజాంసాగర్ మండలం సంగీతంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా గంజాయి మొక్కలతోపాటు రెండు నాటు తుపాకులు లభించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని ఎక్సైజ్ అధికారులు బాన్సువాడ పోలీసులకు అప్పగించారు. కాగా, నాటు తుపాకులను జంతువుల వేటకు వాడుతున్నట్లు నిందితుడు తెలిపాడు.