హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు యూనివర్సిటీల పరిధిల్లో రేపట్నుంచి శనివారం వరకు జరిగే పలు పరీక్షలను వాయిదా వేశారు.
గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.