Harish Rao | పది ఫలితాల్లో సిద్ధిపేట అగ్రస్థానంలో నిలువాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్షలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిలో అదే పంథా ఉండాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలన్నారు. పదిలో పట్టుదలతో 119 నియోజకవర్గాలో సిద్దిపేట నియోజకవర్గం 100శాతం ఫలితాలు సాధించాలన్నారు. ఒక్క విద్యార్థి సైతం ఫెయిల్ కావొద్దన్నారు.
పరీక్షలకు సమయం సమీపిస్తున్న సందర్భంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్పు జరిగింది కానీ.. మనం మన సిద్దిపేట మన ప్రజలు.. మన పిల్లలకు మంచి చేయాలనేది నా నిరంతర తపన అన్నారు. నా పిల్లలను పదో తరగతి అవుతే ఎలా బాధ్యతతో చదివిస్తానో అదే తపనతో తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఎప్పటిలాగే పదో తరగతి పరీక్షా ఫలితాలపై దృష్టి పెట్టాలన్నారు. సిద్దిపేట ప్రతిష్ట, గౌరవాన్ని కొనసాగించాలన్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తయి ప్రత్యేక తరగతులు కావచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అన్ని మనమై అండగా ఉండాలన్నారు.
పిల్లలకు తల్లిదండ్రుల్లా, అక్కా, అన్నల్లా మనం చదివించాలని.. వారిలో చైతన్యం తేవాలన్నారు. ఇప్పటి నుంచే ప్రణాళిక తయారు చేసుకొని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గత సంవత్సరం జిల్లాలో 98.65శాతం ఉత్తీర్ణత వచ్చిందని.. రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచామన్నారు. నియోజకవర్గంలో 98.67శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో సిద్దిపేట నియోజకవర్గమే ముందుండాలన్నారు. నియోజకవర్గం మొత్తంలో 2,516 మంది విద్యార్థులు ఉన్నారని.. వారంతా పాస్ కావాలన్నారు. తనవంతు ప్రయత్నంగా పిల్లల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశామన్నారు.
డిజిటల్ కంటెంట్ బుక్ పంపిస్తున్నానన్నారు. స్నాక్స్ సైతం ఏర్పాటు చేయిస్తానన్నారు. మరింత ఆత్మవిశ్వాసం నింపేలా.. మనోధైర్యం ఇచ్చేలా తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. విద్యార్థులకు అన్ని తానే చూసుకుంటానన్నారు. వందశాతం ఫలితాల బాధ్యత అధికారులు, ప్రధానోపాధ్యాయులదేనన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని.. వారికి సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేయాలని.. అందుకు తనకు సహకారం ఉంటుందన్నారు. 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ కేర్గా ఉంటాలన్నారు. ఈ కేర్ టీచర్లలో పక్షం రోజులకోసారి మాట్లాడుతానన్నారు.
చదువులో వీక్ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆ టీచర్కి అప్పగించిన విద్యార్థుల పాస్ చేయించే.. 10/10సాధించే బాధ్యత వాళ్లదేనన్నారు. ఇంటివద్ద తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. ఇంటి వద్ద పిల్లలు ఫోన్లు వాడకుండా టీవీలు చూడకుండా తల్లిదండ్రులతో మీటింగ్ చేసి పిల్లల చదువుకు పదో తరగతి తొలిమెట్టు అని టీవీలు.. ఫోన్లు ఆటలు ఈ రెండునెలలు బంద్ చేసేలా చెప్పాలన్నారు. నేను వచ్చినప్పుడు పాఠశాలను విజిట్ చేస్తానన్నారు.
గత సంవత్సరం డిజిటల్ కంటెంట్ ఎలా చేసామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిస్తామన్నారు. వీక్ ఉన్న విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడుతానన్నారు. మోటివెటర్స్ను ఏర్పాటు చేపిస్తానన్నారు. ప్రత్యేక కౌన్సెలింగ్ ఇప్పిస్తానన్నారు. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలన్నారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, నోడల్ అధికారి రామస్వామి, మండల విద్యాధికారులు యాదవరెడ్డి, దేశిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.