Harish Rao | సిద్దిపేట : దేశాన్ని కాపాడే జవాన్కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అండగా నిలిచారు. దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో తన భూమి కబ్జా చేశారని జవాన్ రామస్వామి ఆవేదనపై హరీశ్రావు స్పందించారు. తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేయగా.. విషయం తెలుసుకొని హరీశ్రావు వెంటనే స్పందించారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి జవాన్ సమస్యను పరిష్కరించి, తగు న్యాయం చేయాలని హరీశ్రావు సూచించారు.
భారత జవాన్ భూమిని కబ్జా చేసిన వీఆర్వో సోదరుడు
నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని జవాన్ రామస్వామి వాపోయాడు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని వీఆర్వో సోదరుడు కబ్జా చేశాడని తెలిపాడు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఆర్డీవో, కలెక్టర్ పట్టించుకోలేదు. తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని, తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని జవాన్ రామస్వామి వేడుకున్నారు.
Requested @Collector_SDPT Garu to investigate the matter and take necessary action. It’s appalling that a soldier safeguarding our borders faced such an incident. https://t.co/3krAztih5D
— Harish Rao Thanneeru (@BRSHarish) May 17, 2025